దేశవ్యాప్తంగా మొహరం కోలాహలం

దేశవ్యాప్తంగా మొహరం పండుగను ముస్లిం సోదరులు కోలాహలంగా జరుపుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో మొహరం పండుగను జరుపుకునేందుకు గురువారం ఉదయం నుంచి అన్ని ప్రధాన నగరాల్లోని మసీదులు సందడి సందడిగా కనిపిస్తున్నాయి. ముస్లిం ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొహరం పండుగను పురస్కరించుకుని ప్రధాన ప్రార్థన మందిరాల వద్ద పోలీసు యంత్రంగా గట్టి బందోబస్తును ఏర్పాటుచేసింది.

ఇకపోతే... రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ముస్లిం సోదరులు ఉత్సాహంగా మొహరం పండుగను జరుపుకుంటున్నారు. గురువారం జరుగనున్న బీబీకా ఆలం ఊరేగింపును పురస్కరించుకుని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదేవిధంగా సికింద్రాబాద్‌లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి 8.30 గంటల మధ్యన సికింద్రాబాద్ పరిసరాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు శాఖ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి