ప్రాణ త్యాగానికి ప్రతీక మొహరం

ఆదివారం, 3 జూన్ 2007 (18:52 IST)
ఇస్లాం మతస్తులకు ముఖ్యమైన పండగలలో మొహరం ఒకటి. అందుకో ఈ రోజున ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పండగ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

ఇరాక్‌లోవి కర్బరా పట్టణంలో నబికల్ నాయకం మనుమడైన ఇమామ్ హుస్సేన్ (రజి అన్), ఆయన కుటుంబ సభ్యులు కలసి ఇస్లాం మత కట్టుబాట్లు, ఆచారాల పరిరక్షణకు కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ రోజునే మొహరంగా చేసుకుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లీంలు, ముస్లీ పండితులు, సిద్ధాంత కర్తలు... ఇమామ్ ఆయన కుటుంబ సభ్యులు చేసిన త్యాగాన్ని స్మరించుకోవడమే మొహరంగా పేర్కొంటారు. ఇమామ్ చూపించిన భక్తి మార్గంలోనే ముస్లీం ప్రజలు యావత్తు నడచేందుక కృషి చేస్తామని ఆ పవిత్ర రోజున శపథం చేస్తుంటారు.

ఈ సందర్భంగా ముస్లీం సోదరులు వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. తమ వీపులపై ఇనుప కమ్ములతో కొట్టుకుంటా.. రక్తం కారుతున్నా లెక్కచేయకుండా ముందుకు సాగుతుంటారు. ఈ ఊరేంగింపు మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలే జరిగేదాన్ని అత్యంత ప్రధానంగా పేర్కొంటారు.

మొహరం అనేది ఇస్లాం మతం కోసం.. తమ ప్రాణాలను త్యాగం చేయడం ప్రతీకగా పేర్కొంటారు.

వెబ్దునియా పై చదవండి