తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు నిరాశకు గురైన 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నస్పూర్ మండల కేంద్రంలోని జయశంకర్ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అక్షయ, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.