మద్యం, జూదం, పాచికల జోస్యం షైతానీ పనులు!

FILE
దైవభీతి తగ్గిపోతున్న కొద్దీ అనేక రుగ్మతలు మన సమాజాన్ని పీడిస్తున్నాయి. ఈ అన్నింటిలో అతి భయంకరమైనది మద్యపాన సేవనం. ఇది మనిషినిలో అతి భయంకరమైనది మద్యపాన సేవనం. ఇది మనిషిని సామాజికంగా, ఆర్థికంగానే కాదు. ఆరోగ్యపరంగా కూడా తీవ్రమైన నష్టానికి గురిచేస్తుంది. మద్యానికి బానిసలైన వారు అన్ని రకాల చెడుల్లోనూ కూరుకుపోతారు.

తాగుబోతులను సమాజం గౌరవించదు. సమాజంలో పరపతి పడిపోతుంది. బంధుమిత్రులే కాదు, భార్యాబిడ్డలు కూడా అసహ్యించుకుంటారు. మద్యంతో అనర్థాలుండటం బట్టే దైవం మద్యాన్ని నిషేధించాడు. ఈ విషయం పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది. విశ్వసించిన ప్రజలారా! మద్యం, జూదం, బలిపీఠాలు, పాచికల జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన షైతానీ పనులు. (పైశాచిక విషయాలు) కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీ జీవితం సార్థకమవుతుంది.

దాదాపు వేయిన్నర సంవత్సరాలకు పూర్వం ఈ వాక్యం అవతరించినప్పుడు, మహమ్మద్ ప్రవక్త (స) ఇకనుండి మద్యం నిషేధించబడిందని, దాన్ని తాగడం కానీ, దాని వ్యాపారం చేయడం గాని నిషిద్ధమని మదీనా నగరంలో చాటింపు వేయించారు. ఈ ప్రకటన విన్నంతనే మదీనా వాసులు తమ ఇళ్లలో ఉన్న కుండల కొద్దీ సారాయిని వీధుల్లో పారబోస్తే, వీధుల్లో మద్యం ఏరులా పారింది. ఆ సమయంలో మద్యం సేవిస్తున్నవారు తమ నోటి దగ్గర గ్లాసుల్ని గిరాటు వేశారు.

అప్పటికే తాగినవారు నోట్లోకి వేళ్లు జొప్పించి వాంతులు చేసుకున్నారు. ఈ విధంగా దైవాదేశాలను, దైవ ప్రవక్త (సం) హితోపదేశాలను తు.చ. తప్పక పాటించి తమ అంచల విశ్వాసాన్ని రుజువు చేసుకున్నారు. దైవ హెచ్చరికను పెడచెవిన పెట్టి నిషేధాజ్ఞను ఉల్లంఘిస్తే దైవ శిక్ష కోసం ఎదురుచూడవలసిందే. కానీ ఈ రోజుల్లో ప్రజలు మద్యాన్ని ఎందుకు మానలేకపోతున్నారు..!? అలాగే చాలామంది దైవప్రవక్త (స) హితబోధనలను చూసీచూడనట్లుగా, వినీ విననట్లుగా ప్రవర్తిస్తున్నారనే చెప్పాలి.

వెబ్దునియా పై చదవండి