హజ్యాత్ర కోసం ప్రభుత్వం ఈ ఏడాది సుమారు 1.23 లక్షల మందికి రాయితీ కల్పించింది. గత ఏడాది రూ.12 వేలతో యాత్రకు వేళ్లేందుకు సుమారు 1.15 లక్షల మందికి ప్రభుత్వం రాయితీ కల్పించింది.
కాగా, ఈ ఏడాది ఆ సంఖ్యను 1,23,211కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయిచిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్మున్షీ గురువారం ఢిల్లీలో చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 16 ప్రయాణ కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు.
ఈ ఏడాది ఇండోర్లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే ప్రయాణ ఛార్జీలను పెంచలేదని ఆయన చెప్పారు.