ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

ఆదివారం, 23 డిశెంబరు 2018 (17:11 IST)
టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవల వోడాఫోన్ సంస్థ రూ.169కి నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌నను ప్రవేశపెట్టింది. దీనికి ధీటుగా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. 
 
రూ.169 నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. 
 
రిలయన్స్ జియో కూడా అనేక సరికొత్త ప్లాన్లు ప్రవేశపెడుతున్న విషయం తెల్సిందే. రిలయన్స్ జియో రూ.199 పేరుతో ఓ ప్లాన్‌ అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు