కొత్త కృత్రిమ మేధస్సు సంస్థను ప్రారంభించనున్న ఎలాన్ మస్క్

శనివారం, 15 ఏప్రియల్ 2023 (14:12 IST)
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తుతం కొత్త కృత్రిమ మేధస్సు సంస్థను ఏర్పాటు చేయనున్నారు. మస్క్ తన ఏఐ సంస్థను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా చెప్తోంది. నెవాడాలో కేంద్రంగా పనిచేయనున్న ఈ కొత్త కంపెనీలో మస్క్‌ ఏకైక డైరెక్టర్‌‌గా వున్నారు. ఆయన కుటుంబ కార్యాలయాల డైరెక్టర్ జారెడ్ బిర్చాల్‌ను కార్యదర్శిగా పేర్కొంటు ఈ సంస్థ రిజిస్టర్ అయింది.
 
కాగా, కృత్రిమ మేథస్సు (ఏఐ) అభివృద్ధి గురించి గతంలో మస్క్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్.ఏఐ కార్ప్ అనే కొత్త కృత్రిమ మేధస్సు కంపెనీకి మస్క్ నాయకత్వం వహించడానికి శాస్త్రవేత్త ఇగోర్ బాబూస్కిన్‌తో సహా ఇద్దరు మాజీ పరిశోధకులను నియమించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు