మార్చి ఒకటో తేదీ నుంచి జియో ప్రైమ్ మెంబర్షిప్ అమల్లోకి రానుంది. మార్చి 31వ తేదీ లోపు రూ.99 చెల్లించి ఈ సభ్యత్వాన్ని ప్రతి జియో నంబర్ వినియోగదారుడు పొందాల్సి ఉంటుంది. ఈ సభ్యత్వం పొందినవారికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒక యేడాది పాటు రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటాతో పాటు ఫ్రీ వాయిస్కాల్స్ సదుపాయం పొందుతారు. 2018 మార్చి వరకు జియో ప్రైమ్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.