ఫిబ్రవరి 7 భారత్ మార్కెట్‌తో వన్ ప్లస్ 11 5జీ విడుదల

గురువారం, 5 జనవరి 2023 (12:09 IST)
భారతీయ స్మార్ట్ మార్కెట్‌లో మరో స్మార్ట్‌ రానుంది. వచ్చే నెల 7న భారత్‌లోనూ విడదలకానుంది. 6.7 అంగుళాల క్యూహెచ్ డిస్‌ప్లే ఈ4 ఓఎల్ఈడీ పంచ్ హోల్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్ సెట్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. 
 
మొబైల్ ఫోన్ వెనుక భాగంలో భిన్నమైన డిజైన్‌తో ఉంటుంది. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ 54 రేటింగ్, ఇన్‌ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్, 100 వాట్ చార్జర్‌తో రానుంది. ఈ ఫోనులో కెమెరాకు ప్రాధాన్యం ఇచ్చారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్, ఆప్టికల్ ఇజేస్ స్టెబిలైజేషన్, 48 మెగా పిక్సల్ సోనీ ఐఎంఎక్స 581 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 32 మెగా పిక్సల్ సోనీ ఐఎంఎక్ 709 2ఎక్స టెలీఫోటో కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. 
 
మొత్త రెండు వేరియంట్లలో ఈ ఫోనును అందుబాటులోకి తీసునిరానుంది. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ప్రారంభ ధర 3999 యువాన్లు. అంటే భారతీయ కరెన్సీలో రూ.48 వేలు. అలాగే, 16 జీబీ ర్యామ్ ధర రూ.59 వేలు. వచ్చే నెల పదో తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు