జియో దసరా బంపర్ ఆఫర్ .. రూ.699కే ఫోన్

మంగళవారం, 1 అక్టోబరు 2019 (15:06 IST)
దేశ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరోమారు దసరా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా వినియోగదారులకు కోసం ఈ ఆఫర్‌ను వెల్లడించింది. ఇప్పటివరకు జియో ఫోన్‌ను రూ.1500కు విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌ను ఇపుడు రూ.699కే విక్రయించనుంది. 
 
అందుకుగాను గతంలో మాదిరిగా ఎలాంటి ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన పనిలేదు. నేరుగా అదే ధరకు జియో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌ను కొన్న వారికి మొదటి 7 రీచార్జిలపై అదనంగా రూ.99 విలువైన మొబైల్ డేటాను జియో ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. 
 
దీంతో ఫోన్ కొనుగోలుపై రూ.800, 7 రీచార్జిల డేటా విలువ రూ.700 కలిపి మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చు. కేవలం దీపావళి పండుగ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు