వర్క్ ఫ్రమ్ హోం సిబ్బంది కోసం జియో ప్రత్యేక ప్లాన్

బుధవారం, 13 జనవరి 2021 (22:37 IST)
దేశంలో అగ్రగామిగా ఉన్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజా మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం చేసే సిబ్బందికి ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్లాన్ ధర రూ.444. కాలపరిమితి 56 రోజులు. ఇతర టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్లతో పోలిస్తే ఇది చాలా మంచిదని అని జియో చెబుతోంది. 
 
ఈ ప్లాన్ వివరాలను పరిశీలిస్త, ప్లాన్ విలువ 444 రూపాయలు. మొత్తం కాలపరిమితి 56 రోజులు. ప్రతి రోజూ 2 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తం 56 రోజులకుగాను 112 జీబీని వినియోగదారులు వినియోగించవచ్చు. 
 
ఈ డేటా అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగదారులు వాడుకోవచ్చు. పైగా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, అన్ని జియో యాప్‌లను ఉచితంగా వినియోగించవచ్చు. అందుకే ఈ ప్లాన్ వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు