కాల్డ్రాప్స్ విషయంలో టెలికాం ఆపరేటర్లు, ట్రాయ్ సంస్థ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. జనవరి 1 నుంచి ప్రతి కాల్ డ్రాప్కు రూపాయి చొప్పున వినియోగదారులకు పరిహారం ఇవ్వాల్సిందేనని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సంబంధిత టెలికాం సంస్థలకు లేఖ రాసింది. అయితే తాము కోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూస్తామని టెలికాం సంస్థలు తేల్చి చెప్పాయి. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
అప్పటివరకు టెలికాం సంస్థలపై చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం సూచించింది. నెట్వర్క్ సమస్యతో ఫోన్ కాల్ మధ్యలో కట్ అయిపోవడాన్ని కాల్డ్రాప్ సమస్యగా పేర్కొంటున్నారు. ఈ సమస్యపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో జనవరి ఒకటి నుంచి ప్రతి కాల్డ్రాప్కు రూపాయి చొప్పున టెలికాం సంస్థలు వినియోగదారుడికి చెల్లించాలంటూ ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.