అదిరిపోయే ఫీచర్లతో రెడ్మీ వై2... ధర ఎంతంటే...

గురువారం, 7 జూన్ 2018 (17:28 IST)
చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తన తాజా మోడల్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెడ్మీ వై2 పేరుతో దీన్ని విడుదల చేసింది. ఎలెగెంట్ గోల్డ్‌, రోజ్ గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో, 3 లేదా 4 జీబీ ర్యామ్ వేరియెంట్ల‌లో ఈ ఫోన్‌ను తయారు చేసింది.
 
ఈ ఫోన్‌లో 5.99 అంగుళాల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాల‌ను అమ‌ర్చారు. ముందుభాగంలో 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేయ‌గా దీనికి ఫ్లాష్, ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్ర‌త్యేకంగా డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.
 
ఈ ఫోన్‌పై ఎయిర్‌టెల్ రూ.1800 ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్న‌ది. అలాగే, 240 జీబీ మొబైల్ డేటాను ఉచితంగా అందివ్వనుంది. ఇకపోతే, ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఫోన్‌ను కొంటే మ‌రో రూ.500 అద‌న‌పు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ధరను రూ.9,999, రూ.12,999గా నిర్ణయించారు. ఈ ధరలకు అమెజాన్ సైట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. 
 
రెడ్మీ వై2 ఫీచ‌ర్లు...
5.99 అంగుళాల డిస్‌ప్లే, 1440×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు