కొత్త కనెక్షన్ మార్గదర్శకాలకు కమిటీ: రాజా

గురువారం, 4 అక్టోబరు 2007 (13:18 IST)
మరిన్ని కంపెనీలకు కొత్తగా లైసెన్సులు అనుమతి ఇచ్చే విషయంలో కేంద్ర స్థాయిలో నియమించిన కమిటీ మరో పది రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేయనుందని కేంద్ర కమ్యుకేషన్ల శాఖ మంత్రి ఏ.రాజా అన్నారు.

న్యూఢిల్లీలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ టెలికాం ఆపరేటర్ల విషయంలో పరిమితి అనవసరమని ప్రస్తుత ఆపరేటర్లు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారన్నారు.

టెలికాం రంగంలో సమస్యలతో ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి