టెలికాం కంపెనీల పోటీ: తగ్గనున్న కాల్‌రేట్‌లు

FileFILE
శనక్కాయలే.. గుగ్గిళ్లే.. అంటూ బస్టాండులోను.. రైల్వేస్టేషన్‌లలోను విక్రయిస్తుండటం మనం చూస్తుంటాం. తక్కువ ధరే కాబట్టి చాలా మంది కూడా వీటిని కొనుక్కుని ప్రయాణంలో తాపీగా తింటూ పోతుంటారు. ఆర్థిక సంక్షోభం పుణ్యమాని ఇటీవల మార్కెట్‌లో నిత్యావసర వస్తువులతో సహా వీటి ధరలు కూడా పెరిగిపోయాయి. అయినప్పటికీ వీటికున్న డిమాండ్‌ను బట్టి బాగానే అమ్ముడుపోతుంటాయనుకోండి.
మొబైల్ కాల్‌రేట్లు తగ్గే అవకాశం..!
  ప్రముఖ టెలికాం రంగ సంస్థ రిలయన్స్‌ ఇటీవల నిమిషానికి 50 పైసల కాల్‌రేట్ ఉన్న ప్రీపెయిడ్ ప్యాకేజీని విడుదల చేయగా... రోమింగ్‌లో ఇన్‌కమింగ్‌ కాల్‌కు 10పైసలు మాత్రమే అంటూ కొత్త సంస్థ వర్జిన్ మొబైల్ ఇటీవలే ప్రకటించింది. ఈ ఒక్క విషయం చాలు రానున్న రోజుల్లో..      


అదలా ఉంచితే.. నేటి మొబైల్ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో.. టెలికాం వ్యాపారం కాస్త..శనక్కాయల వ్యాపారంలా మారనుంది. ఆశ్చర్యంగా ఉందా.. ఇది చదివితే.. మీకే అర్థమవుతుంది.

దేశంలో పెరుగుతున్న మొబైల్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల పోటీ తారా స్థాయికి చేరనుంది. ఒకరినొకరు అధిగమించుకుంటూ అగ్రస్థానాన్ని అందుకోవాలన్న ప్రతి టెలికాం కంపెనీ లక్ష్యం ఫలితమే ఈ పోటీ. దేశీయ కంపెనీలు ఇలా పోటీపడుతుంటే... విదేశీ కంపెనీలు తమ వంతు ప్రయత్నంగా మన దేశంలో పాగా వేయటానికి ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఆ పోటీ కాస్తా యుద్ధక్షేత్రాన్ని తలపించనుంది. ఇప్పటికే కాల్‌రేట్లు తగ్గిస్తున్నట్లు వివిధ టెలికాం కంపెనీలు ప్రకటించడం ఇందుకు నిదర్శనం.

ప్రముఖ టెలికాం రంగ సంస్థ రిలయన్స్‌ ఇటీవల నిమిషానికి 50 పైసల కాల్‌రేట్ ఉన్న ప్రీపెయిడ్ ప్యాకేజీని విడుదల చేయగా... రోమింగ్‌లో ఇన్‌కమింగ్‌ కాల్‌కు 10పైసలు మాత్రమే అంటూ కొత్త సంస్థ వర్జిన్ మొబైల్ ఇటీవలే ప్రకటించింది. ఈ ఒక్క విషయం చాలు రానున్న రోజుల్లో మొబైల్ వినియోగదారుల పంట పండనుందని చెప్పడానికి.

తమ సంస్థ అభివృద్ధి చెందేందుకు గల ఏ ఒక్క అవకాశాన్ని కూడా టెలికాం కంపెనీలు వదులుకునేందుకు సిద్ధంగా లేవు. ప్రత్యేకించి మొబైల్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లయితే ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదన్నది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌లో వ్యాపారాభివృద్ధి అవకాశాలు మెండుగా ఉండటంతో బహుళజాతి కంపెనీలు కూడా ఇక్కడి మార్కెట్‌పై దృష్టి సారించాయన్నది బహిరంగ రహస్యం.

గ్లోబలైజేషన్ నేపధ్యంలో కమ్యూనికేషన్ తప్పనిసరి అవసరంగా మారింది. ప్రస్తుతం దేశంలోని మొబైల్ వినియోగదారుల సంఖ్య 300 మిలియన్‌లు కాగా... ఇటీవల విడుదలైన సర్వేల ప్రకారం 2012 నాటికి ఆ సంఖ్య 700 మిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా. ఇదే సర్వేలో ప్రపంచంలోకెల్లా భారత్‌లో మాత్రమే మొబైల్ టారిఫ్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.

ఇక ఈ అంశంపై ఇండస్ వ్యూ అడ్వైజర్స్ లిమిటెడ్ ఛైర్మన్ బున్‌దీప్ సింగ్ రంగార్ మాట్లాడుతూ... తమ సంస్థల్లోకి కొత్త సభ్యులను చేర్చుకునేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల తక్కువ ధరల టారిఫ్ ప్యాకేజీని అమలులోకి తెచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.విదేశీ పెట్టుబడుల విధానం (ఎఫ్‌డీఐ)లో మార్పులు చేసినట్లయితే
రానున్న ఐదేళ్లలో మొబైల్ టెలికాం వ్యాపారం మరింత పుంజుకుంటుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి