పాలులో అధికంగా క్యాల్షియం శాతం అధికంగా ఉంటుంది. అదే క్యాల్షియం రాగి, చిరు ధాన్యాల్లోనూ పుష్కలంగా ఉంది. అందుచేత పాలు తాగమని చెప్పడం కంటే రాగి జావ ఇవ్వడం అలవాటు చేయండి. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
అలాగే రాజ్మా, శెనగలు, నువ్వుల ఉండలు, ఆకుకూరలను కూడా పిల్లలకు ఆహారంగా పెడుతూ ఉంటే క్యాల్షియంతో పాటు ఇతరత్రా పోషకాలు లభిస్తాయి. ఇంకా నువ్వుల పొడితో కలిపిన అన్నం ముద్దలు, ఇడ్లీలు తినిపించాలి.
పాల రూపంలోనే కాకుండా పనీర్ లేదా చీజ్ రూపంలోనూ పిల్లలకు నచ్చిన వంటకాలను సర్వ్ చేయొచ్చు. తేనె, వేరుశెనగలు రోజు వారి పిల్లల డైట్లో చేర్చుకుంటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.