తాత్పర్యం : ఓ వేమా..! నీటితో నిండి ఉండే నదులు గంభీరముగ నిలిచి ప్రవహిస్తూంటాయి. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తాయి. అదే విధంగా చెడ్డ గుణాలు కలిగినటువంటి వారు తొందరపాటుతనంతో కూడిన మాటలు మాట్లాడేటట్లుగా.. మంచి గుణాలు కలిగిన వారు మాట్లాడరని ఈ పద్యం యొక్క భావం.