ఈ వివాహం గురించి అడిగినప్పుడు, తృణమూల్ ఎంపీ ఒకరు, "నాకు తెలియదు" అని అన్నారు. మొయిత్రా లేదా మిశ్రా ఇద్దరూ ఈ వివాహాల గురించి ఎటువంటి బహిరంగ ప్రకటనలు లేదా సోషల్ మీడియా పోస్ట్లు చేయలేదు.
అయితే, మొయిత్రా ఇటీవల జర్మనీలో కనిపించి, నవ్వుతూ బంగారు ఆభరణాలలో ముస్తాబై కనిపించారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణనగర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్ను వివాహం చేసుకున్నారు. తరువాత ఆమె న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్తో కలిసి వున్నారు.
ఇక బీజేడీ సీనియర్ నాయకురాలు పినాకి మిశ్రా, లోక్సభలో ఒడిశాలోని పూరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక వారి రాజకీయ అనుబంధాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ జంట జర్మనీలో రహస్యంగా వివాహం చేసుకుందని టాక్ వస్తోంది.