తాత్పర్యం : ఉడుము నూరు సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, కొంగ మడుగులో చాలా కాలము దాకా జీవిస్తాయి. అయితే వాటివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? అదే మంచిపనులను చేసే విషయంలో ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే.. వారివల్ల ప్రయోజనం ఉంటుందని సుమతీ శతకకారుడు ఈ పద్యంలో చెప్పాడు.