శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనుల నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ...!
తాత్పర్యం : సుమతీశతక కారుడు 'సుమతీ' అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్పెదనని తెలిపినాడు. లోకములో నీతి మార్గమును ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహము పొందిన వాడనై లోకులు మెచ్చుకొను నట్టి... మరలమరల చదువ వలెను అనే ఆశ కలుగునట్లుగా వచించుచున్నానని ఈ పద్యం యొక్కం భావం.