దైవ భక్తులకు తరుణోపాయం చుపుతూ సర్వలోకాలూ సంచరించే దివ్యముని నారదుడు. తండ్రి బ్రహ్మదేవుని వద్ద సత్య జ్ఞానాన్ని ఆర్జించాడు నారదుడు. ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు. హిమాలయాల్లో కఠోర తపస్సు సాగించాడు. దేవతల రాజు ఇంద్రునికి అనుమానం వచ్చింది. బృహస్పతులవారితో సంప్రదించాడు. " నారదుడు ఎందుకోసం తపస్సు చేస్తున్నట్లు?" అనడిగాడు.
మీ సింహాసనం కోసం కావచ్చు అన్నాడు బృహస్పతి.
తత్తరపడ్డాడు ఇంద్రుడు. ఏం చేయాలిప్పుడు అనుకున్నవాడై... ప్రాపంచిక సుఖాలతో ప్రలోభపెట్టి తపోమార్గం నుంచి ఆయనను తప్పక తప్పించాలి అనుకున్నాడు. ఈ ఉద్దేశ్యంతో ఇంద్రుడు కామదేవుణ్ణి పిలిచాడు.