కృష్ణా పుష్కరాలు 2016... ఏ వాహ‌నం, ఎక్క‌డ నిల‌పాలి...?

గురువారం, 11 ఆగస్టు 2016 (21:52 IST)
విజ‌య‌వాడ‌: కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను ఎక్క‌డ నిలుపుతారో వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించారు. ఆగస్టు 12 నుంచి పుష్క‌రాలు ముగిసే వ‌ర‌కు నిర్దేశిత ప్రాంతాల్లో వాహ‌నాలు నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు ఆదేశించారు. 
 
*  బస్సులు ఆపే ప్రాంతాలు : హైదరాబాద్ రూటులోంచి వచ్చే బస్సులను ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు అనుమతి 
*  ఏసీ బస్సులకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు అనుమతి.
*  తిరువూరు, మైలవరం నుంచి వచ్చే బస్సులకు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్  ఎ- కాలనీలో స్టాప్ ఏర్పాటు.
* విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులను వైవీ రావ్ ఎస్టేట్ వద్ద నిలిపివేత
* తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి  జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిలిపివేత
*  మచిలీపట్నం, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే బస్సులను కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద నిలిపివేత
* తిరుపతి నుంచి ఆ రూట్ లో వచ్చే బస్సులను గుంటూరు బస్ స్టేషన్ వరకు అనుమతి - అక్కడి నుంచి గుంటూరు-విజయవాడ పుష్కర్ స్పెషల్ షటిల్ సర్వీసులు.
 
*  రైళ్లు నిలుపుదల ప్రాంతాలు  :  హైదరాబాద్ నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను రాయనపాడు వరకు అనుమతి.
*  విశాఖపట్నం నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను రామవరప్పాడు, గుణదల స్టేషన్లలో నిలుపుదల.
* గుంటూరు వైపు నుంచి, తెనాలి వైపు నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వరకూ అనుమతి - అక్కడ నుంచి పుష్కర్ స్పెషల్ బస్సుల్లో విజయవాడ చేరుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి