కాకినాడ లోక్‌సభ 2019 ఫలితాలు లైవ్ రిజల్ట్స్

మంగళవారం, 21 మే 2019 (22:08 IST)
[$--lok#2019#state#andhra_pradesh--$]
 
ప్రధాన ప్రత్యర్థులు: చలమలశెట్టి సునీల్ (తెదేపా) వర్సెస్ వంగ గీత (వైసీపి)
 
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెదేపాకు చెందిన తోట నరసింహం విజయం  సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపి నుంచి వంగ గీత బరిలోకి దిగారు. మరోవైపు వైకాపా నుంచి టీడీపీకి జంప్ అయిన చలమలశెట్టి సునీల్ బరిలోకి దిగనుండగా, జనసేన తరపున జ్యోతుల వెంకటేశ్వర రావు పోటికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పోటీ హోరాహోరీ వుంటుందని చెప్పవచ్చు.
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో తెదేపాకు చెందిన తోట నరసింహంకు 514,402 ఓట్లు పోలవగా, తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి సునీల్ కుమార్ చలమలశెట్టికి 510,971 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు.

వెబ్దునియా పై చదవండి