కాశ్మీరంలో చల్లారిన అల్లర్లు: కొనసాగుతున్న కర్ఫ్యూ!

హింసాకాండతో యుద్ధభూమిని తలపించిన జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం ప్రశాంతత వాతావరణం నెలకొంది. అయితే కర్ఫ్యూ మాత్రం యధావిధిగా కొనసాగుతోంది. శుక్రవారం పూట కాశ్మీర్‌లోని ఏ ప్రాంతంలోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

రాళ్లతో ఆందోళన కారులు దాడికి దిగడంతో భద్రతా దళాలు వారిపై లాఠీఛార్జ్ ప్రయోగించారు. దీంతో గత వారం రోజులుగా జమ్మూకాశ్మీర్లో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలర్లను అదుపు చేసేందుకు కాశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం కాశ్మీరంలో అల్లర్లు చల్లారినప్పటికీ కర్ఫ్యూను ఎట్టి పరిస్థితుల్లో సడలించేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకా కాశ్మీరంలోని ఉద్రిక్తత చోటు చేసుకునే ప్రాంతాల్లో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి