గుజరాత్ పర్యాటక రంగం వృద్ధి భేష్ : సీఎం నరేంద్ర మోడీ

FILE
భారత పర్యాటక రంగం ఏడు శాతం వృద్ధి నమోదు చేసుకుంటే, గుజరాత్ పర్యాటక రంగం 16 శాతం వృధ్దిని నమోదు చేసుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

పర్యాటక రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, ప్రోత్సాహం వల్ల గణనీయమైన వృద్ధిరేటు నమోదైందన్నారు. దేశం మొత్తంమీద పర్యాటక రంగ అభివృద్ధితో పోలిస్తే గుజరాత్ పర్యాటకం రెట్టింపు అభివృద్ధిని నమోదు చేసుకుందని వ్యాఖ్యానించారు.

సబర్మతి నది ఒడ్డున ఆదివారం 25వ అంతర్జాతీయ పతంగుల పండుగను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పతంగుల పండుగతో గుజరాత్‌కు ప్రపంచస్థాయి గుర్తింపును ఎలా తీసుకురావచ్చో చేతల్లో చూపించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి