ఛత్తీస్ఘడ్లో ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గడ మహాసముంద్ జిల్లాలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు.
మహారాష్ట్ర-ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగడంతో మహాసముంద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
అలాగే శుక్రవారం పోలీసులకు-మావోలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాఠశాల విద్యార్థులతో పాటు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇందులో ముకేష్ పొటావి (6) అనే విద్యార్థిని నాగ్పూర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పొటావి చికిత్స ఫలించక మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.