ఫ్రెండ్స్‌కు ఆఫర్: భార్యతో ఒక్కరాత్రికి లక్షన్నర వెలకట్టిన భర్త!

శుక్రవారం, 6 డిశెంబరు 2013 (13:15 IST)
FILE
డబ్బుపిచ్చి పట్టుకుని రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోవాలన్న కోరికతో తన భార్యమానాన్ని లక్షన్నర రూపాయలకు అమ్ముకున్నాడో వ్యక్తి. డబ్బు ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది అని చెప్పడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. పశ్చిమబెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల ఇస్సార్ అలీ లష్కర్ నలుగురి స్నేహితుల కామవాంఛకు తన భార్యమానాన్ని పణంగా పెట్టాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.....

పశ్చిమబెంగాల్ నుంచి ముంబై వెళ్లిపోవడానికి అలీ తన భార్యను ఒప్పించాడు. మరుసటి రోజు తన స్నేహితులు నలుగురికి కాల్ చేశాడు. లక్షన్నర రూపాయలు ఇస్తే తన భార్యను ఒక రాత్రికి పంపుతానని ఆఫర్ చేశాడు. 30న రాత్రి భార్యను తీసుకుని మన్‌ఖుర్ద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అప్పుడే అక్కడకు అతని ఫ్రెండ్స్ నలుగురు వచ్చి ఉన్నారు. వారితో కలిసి ఆటోలో వెళ్లమని అలీ తన భార్యకు చెప్పాడు. ఆటో వెనకే అతడు బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక ఆటో ఎటో వెళ్లిపోయింది.

భైగాన్ వాడి లోని జాకీర్ హుస్సేన్ నగర్‌కు తీసుకెళ్లి ఆమెపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అరుపులు విన్న స్థానికులు నలుగురు దుండగులను పోలీసులకు పట్టించారు. అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇంతచేసీ దుండగులు అలీకి రూపాయి కూడా ఇవ్వలేదు. అత్యాశకు పోతే ఇలాగే జరుగుతుందని చెప్పడానికి ఇదో ఊదాహరణ.

వెబ్దునియా పై చదవండి