మంగళవారం జరగనున్న బసు అంత్యక్రియలు

ఆదివారం, 17 జనవరి 2010 (16:00 IST)
కమ్యూనిస్టు పార్టీ వయోవృద్ధుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.

జ్యోతి బసు అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం కోలకతాలోని కియోరాట్ల శ్మశాన వాటికలో జరుగుతాయని కోలకతా మేయర్ బికాష్ భట్టా ఛటర్జీ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బసు మృతికి సంతాప సూచకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది.

ఇదిలావుండగా బసు అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి