హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం: 22 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మశాలకు 45 కిలోమీటర్ల దూరంలో కంగరా జిల్లాలోని హరిపూర్ సమీపంలో ప్రయాణికులతో కూడిన బస్సు లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.

డ్రైవర్ చేతుల్లోని బస్టు కంట్రోల్ తప్పిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెపుతున్నారు. నగ్రోతా సూరియన్ అనే ప్రాంతం నుంచి దెహ్రాకు వెళుతుండగా 100 అడుగుల లోతులో ఉన్న లోయలో బోల్తా పడిందని కంగారా జిల్లా ఎస్పీ అతుల్ ఫల్జెలే తెలిపారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తండాలోని డాక్టర్ రాజేంద్ర ప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్టు చెప్పారు. దుర్ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, మృతుల సంఖ్య పెరగవచ్చని సహాయక సిబ్బంది తెలిపారు.

వెబ్దునియా పై చదవండి