వధువులకు గుడ్ న్యూస్.. అరుంధతి గోల్డ్ స్కీం కింద ఒక తులం

బుధవారం, 9 డిశెంబరు 2020 (12:23 IST)
నూతన వధువులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. తక్కువ ఆదాయమున్న వధువులకు అరుంధతి గోల్డ్ స్కీం కింద అసోం ప్రభుత్వం ఒక తులం బంగారాన్ని బహుమతిగా అందించాలని నిర్ణయించింది. దీనికోసం 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో రూ.300కోట్లను కేటాయించింది. ఐదు లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల్లోని వధువులకు ఈ బంగారం బహుమతిగా ఇవ్వనున్నారు. 
 
ఈ పథకం మొదటి ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే లభిస్తోంది. పెళ్లి సమయంలో ప్రభుత్వం వధువులకు బంగారం బహుమతిగా అందించనుంది. దరఖాస్తుదారులు వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రోజే అరుంధతి బంగారు పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. మొదటి వివాహానికే ఈ బంగారం బహుమతిగా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు