సాధారణంగా మనుషులకు, జంతువులను చంపేందుకు విష ప్రయోగం చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ చెట్టును నరికివేసేందుకు విషమిచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని పెరుంగుడికి సమీపంలో ఇది జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. కానీ, ఇక్కడ భారీ వృక్షం అడ్డు తొలగించుకునేందుకు విషమిచ్చి చంపినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
దాని వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయటం ద్వారా అది ఎండిపోయేలా చేసి దానిని తొలగించాలని చూశారని వారి వాదన. ఇటీవల దానిని పరిశీలించిన నిపుణుల బృందం సైతం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తుంది' అని తేల్చారు. ఇప్పటికే ఆ చెట్టు 80 శాతం ఎండిపోయిన కారణాన్ని చూపుతూ దాని భాగాలు చాలావరకు తొలగించారు. దీంతో హార్టీకల్చర్ నిపుణులు దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.