ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. చిన్నారి మర్మాంగంలో కర్రలు కుక్కి...

ఆదివారం, 26 మార్చి 2017 (11:48 IST)
ఇటీవలి కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 14 యేళ్ళ చిన్నారిని కొంతమంది బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతటితో ఆగలేదు. అత్యంత కర్కశంగా చిన్నారి మర్మాంగంలో కర్రలు కుక్కి రక్తస్రావం అయ్యేలా చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లేనని పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి