నదిలో పడిపోయిన ప్రైవేటు బస్సు - 15 మంది మృతి

మంగళవారం, 9 మే 2023 (10:48 IST)
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఖర్గోన్‌ నుంచి ఇండోర్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి 50 అడుగుల కిందున్న నదిలో పడింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు