బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ఈ ప్రకంపనలు నమోదైనాయి. ఈ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను ప్రభావితం చేశాయి. కోల్కతాకు నైరుతి దిశగా 109 కిలోమీటర్లు, ఒడిశాకు ఈశాన్యంగా 175 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయ్యింది.
తొలుత సునామీ హెచ్చరికలు వస్తాయని భావించినా, అధికారికంగా అలాంటి అనుమానాలు లేవని చెప్పడంతో సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదు.