ఒకప్పుడు రేమాండ్ కోటీశ్వరుడాయన... కొడుకు దెబ్బకు 'బిచ్చగాడి'లా...

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:23 IST)
మనిషిని నమ్మితే ఏముందిరా.... చెట్టును నమ్మినా ఫలితముందిరా అని ఓ కవి చెప్పినట్లు కన్న కొడుకులే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలకో, లేదంటే ఏ ఆసుపత్రులలోనో వదిలేసి వెళ్లిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన రేమాండ్స్ వ్యవస్థాపకుడు విజయ్ పథ్ సింఘాని ఇప్పుడు వీధినపడ్డారు. 
 
చేతిలో చిల్లిగవ్వ లేక అద్దె ఇంట్లో నానా అవస్థలు పడుతున్నారు. 78 ఏళ్ల వయసులో ఆయన పడుతున్న ఈ కష్టాన్ని చూసి ఇరుగుపొరుగు వారు ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయల వ్యాపారంతో తులతూగే విజయ్ పథ్ సింఘానియాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది కూడా ఆయన పుత్రరత్నమే. వ్యాపారాన్నంతా కైవసం చేసుకుని తండ్రిని వీధిన పడేశాడు. ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియా తండ్రి కనీస అవసరాలను తీర్చేందుకు కూడా డబ్బు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారట. 
 
తనకు రావాల్సిన ఆస్తి, డబ్బును ఇప్పించండి మహా ప్రభో అంటూ ఇప్పుడు రేమండ్ దిగ్గజం విజయ్ పథ్ సింఘానియా కోర్టు మెట్లెక్కారు. ఏం చేస్తాం... కలికాలం. కన్నబిడ్డలే కాటికి పంపే దారుణ స్థితి. మరోవైరు విజయ్ పథ్ సింఘానియా పిటీషన్ పైన స్పందించిన కోర్టు రేమాండ్ సంస్థకు నోటీసులు పంపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు