ఆదివారం జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఆమె ఎన్నికైన విషయం తెల్సిందే. పార్టీకి, ప్రభుత్వానికి రెండు వేర్వేరు అధికార కేంద్రాలు ఉండటం మంచిది కాదని భావించినందునే శశికళను పార్టీ శాససనసభా పక్ష నేతగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే నిర్ణయించినట్టు చెబుతున్నారు.
అయితే, ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మాత్రం చెన్నైలో లేరు. కేంద్ర హోంశాఖ పిలుపుమేరకు ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న ఆయన తమిళనాడుకు మాత్రం ఇన్ఛార్జ్ గవర్నర్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఉదయానికి ఆయన చెన్నైకు చేరుకోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.