ఇదిలావుండగా, పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో అప్రమత్తమైన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వేగంగా పావులు కదుపుతున్నారు. తనకు మద్దతు తెలుపుతున్నట్టు వారి నుంచి సంతకాలు సేకరించారు. ఆ తర్వాత వారిని రహస్య ప్రాంతానికి తరలించారు. పన్నీర్ సెల్వం, డీఎంకే, బీజేపీ వంటి పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు నెలకొనకుండా ఆమె అనుచరులు ఎమ్మెల్యేల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, వారి నుంచి ఎలాంటి సమాచారం ఇతరులకు చేరకుండా చర్యలు చేపట్టారు. దీంతో తమిళనాట కలకలం రేగుతోంది. అధికారం కోసం శశికళ వేస్తున్న ఎత్తులు, కదుపుతున్న పావులను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుగుబాటు ఎగురవేసిన ఓ.పన్నీర్ సెల్వంకు రాష్ట్ర యువత, ప్రజలు అండగా నిలుస్తున్నారు.