తన భర్త కనిపించడం లేదంటూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి బుధవారం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఈమె భర్త లింగేశ్వర తిలగన్పై ఆ పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేసిన విషయంతెల్సిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాపడ్డారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు రక్షించి... స్థానిక రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదిలావుండగా, అన్నాడీఎంకే నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శశికళా పుష్ప భర్త లింగేశ్వరన్ తిలగన్ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ కార్యాలయంలోకి హద్దుమీరి ప్రవేశించి, దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను అరెస్టు చేశారు.