సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడైన ఓ తండ్రి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ ఉన్నప్పటికీ ఆ తండ్రి బుద్ధి గడ్డి తినింది. కన్న కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సూరత్లోని సచిన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. బాధితురాలు, ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ ఇనస్పెక్టర్ పి.బి. సాప్రా కథనం ప్రకారం... 42 ఏళ్ల హెచ్.ఐ.వి పాజిటివ్ వ్యక్తి ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పుట్టిన కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ ఉండటంతో ఇప్పటివరకూ ఆ బాలిక తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. చివరికి తన తల్లితో కలసి ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్కు వచ్చింది.