ఏటీఏజీఎస్‌ను విజయవంతంగా పరీక్షించిన రక్షణ శాఖ

ఆదివారం, 20 డిశెంబరు 2020 (11:59 IST)
భారత రక్షణ శాఖ మరో కీలక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. అడ్వాన్స్‌డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టం (ఏటీఏజీఎస్) అనే అత్యాధునిక ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 
 
ఒడిశా తీరంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది సులభంగా ఛేదించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 2016లో ఏటీఏజీఎస్ తుపాకుల ప్రాజెక్టుకు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఈ ఆయుధం తయారీలో భారత్ ఫోర్జ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది.
 
అంతర్జాతీయ స్థాయిలో ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ శైలేంద్ర వెల్లడించారు. ఏటీఏజీఎస్ తుపాకులు భవిష్యత్తులో భారత ఆర్మీలో కీలకంగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు