నా జీవితంలో ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నా మోదీజి.... సుష్మా ఆఖరి ట్వీట్

బుధవారం, 7 ఆగస్టు 2019 (00:49 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ తన చివరి ట్వీట్‌ను ప్రధానమంత్రి మోదీకి రాశారు. తన జీవితంలో ఇలాంటి రోజుకోసమే ఎదురుచూస్తున్నాననీ, థ్యాంక్స్ మోదీజి అంటూ ఆమె ట్విట్టర్లో తెలిపారు.
 
సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గం. 8.30 నిమిషాలకు గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో స్వగృహంలోనే కుప్పకూలారు. ఆమెకు గుండెపోటు రావడంతో వెనువెంటనే ఎయిమ్స్ కి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆమె వయసు 67 సంవత్సరాలు.
 
సుష్మా హఠన్మరణంతో భాజపా శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రులు ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. గత కొంతకాలంగా సుష్మా కిడ్నా సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే కొందరు మంత్రులు ఆమెను పరామర్శించి వచ్చారు.
 
తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్‌ కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తనను చిన్నమ్మ అని మీరు పిలవండి అంటూ చెప్పారామె.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు