అత్యాచారం కేసులో సెటిల్మెంట్ వ్యవహారం ముంబైలో ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ యువతి రేపిస్టుతోనే సెటిల్మెంట్ చేసుకుని కేసును కోర్టు కొట్టేశాలా చేసింది. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు రేపిస్టు అంగీకరించడంతో ముంబయి హైకోర్టు కూడా కేసును కొట్టివేస్తూ సంచలనాత్మక తీర్పు వెలువరించింది.