తమిళనాడులో ఎన్నికల వేడి హీటెక్కిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శరత్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే శరత్కుమార్ కారు నుంచి పోలీసులు రూ.9లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కట్చి పార్టీ చీఫ్ అయిన శరత్కుమార్, అన్నాడీఎంకే తో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కారులో అక్రమంగా డబ్బు తరలిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను శరత్ కుమార్పై కేసు నమోదు చేసినట్టు తమిళనాడు పోలీసులు చెప్పారు.