కారులో రూ.9లక్షల నగదు స్వాధీనం.. శరత్ కుమార్‌పై కేసు.. !

బుధవారం, 11 మే 2016 (10:27 IST)
తమిళనాడులో ఎన్నికల వేడి హీటెక్కిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే శరత్‌కుమార్ కారు నుంచి పోలీసులు రూ.9లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కట్చి పార్టీ చీఫ్ అయిన శరత్‌కుమార్, అన్నాడీఎంకే తో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కారులో అక్రమంగా డబ్బు తరలిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను శరత్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తమిళనాడు పోలీసులు చెప్పారు.
 
మే ఏడో తేదీ ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ నల్లూరు విలక్కు జిల్లాలో కారులో డబ్బును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శరత్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 171హెచ్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి