సీబీఐ దూకుడు.. ఏక కాలంలో 12 రాష్ట్రాల్లో సోదాలు

బుధవారం, 3 జులై 2019 (09:29 IST)
సీబీఐ వరుస సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్తంగా రెండో రోజూ సోదాలు కొనసాగిస్తోంది. తాజాగా 14 కేసులకు సంబంధించి 12 రాష్ట్రాల్లోని 18 నగరాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 
 
సుమారు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. వివిధ సంస్థలు, కంపెనీలు, వాటికి ప్రమోటర్స్‌గా ఉన్న వారిళ్లల్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి. సోమవారం కూడా సీబీఐ ఇదే తరహా తనిఖీలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. కోల్‌కతాలోని వివిధ 22 చోట్ల సోదాల్లో పాల్గొంది. పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ సోదాల్లో పాలుపంచుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు