పంజాబ్ ముఖ్యమంత్రి ఇంటికి రూ.10 వేల జరిమానా

ఆదివారం, 24 జులై 2022 (14:26 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇంటికి చండీగఢ్ మున్సిపాలిటీ అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. చండీగఢ్‌లోని ఆయన ఉండే ఇంటి వెలుపల చెత్త కనిపించింది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు రూ.10 వేల అపరాధం విధించారు. 
 
సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్జీందర్ సింగ్ పేరిట ఈ మేరకు చలాన్ జారీ అయింది. ఇందులో పంజాబ్ సీఎం ఇంటి చిరునానా ఉండటం గమనార్హం. 
 
దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ, సీఎం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో చెత్తను రోడ్డుపై పడేయొద్దంటూ పలుమార్లు సీఎం ఇంటి సిబ్బందికి తెలిపినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని అందుకే అధికారులు రూ.10 వేల అపరాధం విధించారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు