హిమాలయ పర్వాత శ్రేణుల్లో కొలువున్న మహాశివుని దర్శించుకునేందుకు భక్త జనం కదిలింది. హిందువులు పరమ పవిత్ర యాత్రగా భావించే ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఉదయం 11:30 గంటల సమయంలో యమునోత్రి గేట్లను అధికారులు తెరువగా, మధ్యాహ్నం 12.30 గంటలకు గంగోత్రి ఆలయ తెలుపులు తెరిచి తొలి బ్యాచ్ భక్తులకు అనుమతి ఇచ్చారు.
కాగా ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, సీనియర్ అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలు చార్ ధామ్ ప్రాంతాలను సర్వనాశనం చేయగా, 7 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అటువంటి విపత్తులు ఏర్పడినా, ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు రావత్ తెలిపారు.