మెట్రో ప్రయాణీకులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గింపు

శనివారం, 20 ఫిబ్రవరి 2021 (14:59 IST)
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణికులకు శుభవార్త వినిపించారు. చెన్నై మెట్రో ఛార్జీలను ప్రస్తుతమున్న ఛార్జీలపై రూ. 20 తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
 
ఛార్జీల తగ్గింపు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే కనీస ఛార్జి రూ. 10 అలాగే ఉంటుందని పేర్కొన్నారు. చెన్నై మెట్రోలోని అన్ని మార్గాల్లో ప్రయాణించడానికి రూ. 70 అవసరం. కానీ ఇప్పుడు తగ్గించిన ఛార్జీలతో ఆ ఛార్జీ రూ. 50కు తగ్గింది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు