కరోనా ఎఫెక్టు.. ఎంపీల జీతాల్లో కోత... ఎంపీ లాండ్స్ నిలిపివేత

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:28 IST)
కేంద్ర మంత్రివర్గం రెండు అత్యత కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని, ఎంపీలకు ఇచ్చే నిధుల (ఎంపీ లాడ్స్)ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యేడాది పాటు ఎంపీల వేతనాలు, అలవెన్స్‌లు, పెన్షన్లలో ఈ కోత ఉండేలా ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చారు. ఇందుకోసం 1954 చట్టాన్ని సవరించారు. 
 
ఈ విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ సోమవారం మీడియాకు వివరించారు. ఎంపీ లాడ్స్  2020-21, 2021-22కు సంబంధించి మొత్తం నిధులు రూ.7900 కోట్లు అని, ఈ మొత్తంతో కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో ఓ నిధిని ఏర్పాటు చేసి, కరోనా సహాయక చర్యల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ వేతనాల్లో 30 శాతం కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు