గృహ హింస, హత్యాయత్నం కేసుల్లో అరెస్టయిన ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతికి బెయిల్ మంజూరైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఢిల్లీ సిటీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
అయితే, లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తును సమర్పించాలని, విచారణ పూర్తయ్యేంత వరకు దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా, తనను వేధిస్తున్నాడని భార్య లిపికా మిత్రా పెట్టిన కేసులో సుప్రీంకోర్టు ఆదేశానుసారం కొన్నిరోజుల క్రితం సోమ్నాథ్ భారతి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.