సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లకు తోడు టెలివిజన్లు యువతపై బాగానే ప్రభావం చూపుతోంది. ఓ రియాల్టీ షో చూసిన పాపానికి 17 ఏళ్ల బాలుడు హంతకుడు అయ్యాడు. రియాల్టీ షోను చూసి అదే తరహాలో 17 ఏళ్ల బాలుడు తన స్నేహితుడి హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జైత్పూర్లో తన స్నేహితుడిని 17 ఏళ్ల యువకుడు 22సార్లు రాయితో మోది యమున నదిలో పడేసి స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. జైత్పూర్ ప్రదేశానికి చెందిన యువకుడు తన స్నేహితుడిని పార్టీ ఇస్తానని చెప్పి పవర్ ప్లాంట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్స్ తాగుతూ.. మ్యాజిక్ చేస్తానని నమ్మబలికి.. స్నేహితుడు తలకు నల్లని వస్త్రాన్ని కప్పేశాడు. అంతటితో ఆగకుండా 22 సార్లు రాయితో కొట్టి హతమార్చాడు. ఆపై ఇంటికెళ్లి ఏమీ తెలియనట్లు స్నేహితుడి కోసం మృతుని తల్లిదండ్రులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టాడు.